ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ గ్రాఫ్ మరింత దిగజారుతుంది

CM KCR's graph will fall further after Munugode by-polls. త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర్ రావు

By Medi Samrat
Published on : 19 Aug 2022 8:00 PM IST

ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ గ్రాఫ్ మరింత దిగజారుతుంది

త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర్ రావు గ్రాఫ్ మరింత దిగజారుతుందని బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మునుగోడులో వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్ కు ఒక నియోజకవర్గం గుర్తుకు వస్తుందన్నారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రజలను పూర్తిగా మర్చిపోయారని అన్నారు. కమీషన్ల ద్వారా కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు సంపాదిస్తున్నదని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భారీ అవకతవకలను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా ఎత్తిచూపారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం తాకట్టు పెట్టిందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుందన్నారు. ఆగస్టు 21న అమిత్ షా బహిరంగ సభ తర్వాత తెలంగాణలో రాజకీయ పరిస్థితుల్లో భారీ మార్పు వస్తుందని వివేక్ విశ్వాసం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు.


Next Story