రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

CM KCR to chair TRS parliamentary party meeting tomorrow. రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

By Medi Samrat
Published on : 29 Jan 2022 4:26 PM IST

రేపు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి టీఆర్ఎస్‌ ఎంపీలందరితో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు సమస్యలపై ఎంపీలు ముఖ్యమంత్రికి నివేదికలు సమర్పించనున్నారు. కాగా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పాత బకాయిలపై ఎంపీలతో సీఎం మాట్లాడనున్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను గట్టిగా ప్రశ్నించాలని ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. సోమవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా.. బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి దశ.. మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు జరగనున్నాయి.


Next Story