'బంగారు భారత్‌' కు సమయం ఆసన్నమైంది : కేసీఆర్‌

CM KCR seeks people’s support to create ‘Bangaru Bharat’. బంగారు తెలంగాణ తరహాలో దేశాన్ని 'బంగారు భారత్‌' గా అభివృద్ధి చేసేందుకు

By Medi Samrat  Published on  21 Feb 2022 12:21 PM GMT
బంగారు భారత్‌ కు సమయం ఆసన్నమైంది : కేసీఆర్‌

బంగారు తెలంగాణ తరహాలో దేశాన్ని 'బంగారు భారత్‌' గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల మద్దతును కోరారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని ఆయ‌న అన్నారు. భారతదేశం.. అమెరికా, ఇతర దేశాలకు అతీతంగా అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధిలో భార‌త్‌ ఇతరులకు రోల్ మోడల్‌గా మారుతుందని ఆయన అన్నారు. సోమవారం నారాయణఖేడ్‌లో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఎంతో ముందుకు సాగిందన్నారు.

అభివృద్ధిలో తెలంగాణ తన సోదర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను అధిగమించిందని అన్నారు. జాతీయ స్థాయిలో కొత్త పుంతలు తొక్కుతున్నదని అన్నారు. తెలంగాణ‌ అభివృద్ధి పరంగా జాతీయ స్థాయిలో కొత్త పురోగతులు సాధిస్తోందని అన్నారు. 'తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది. కానీ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా దేశం ముందుకు సాగలేదు. కాబట్టి, రాష్ట్రం మెరుగైన ప్రగతిని సాధించేలా కృషి చేసిన మ‌నం.. దేశ అభివృద్ధికి కూడా కృషి చేయాలని అన్నారు.

దేశంలో విభజన, మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి అవకాశాల కల్పన సులభతరం చేసేందుకు అభివృద్ధి, ఉపాధిపై దృష్టి సారించాలని సూచించారు. "శాంతియుత వాతావరణం మరియు శాంతిభద్రతలను సక్రమంగా నిర్వహించకుండా మనం అభివృద్ధిని సాధించలేమని అన్నారు. ఈ విషయంపై ప్రజలు తమలో తాము చర్చించుకుని ఒక నిర్ధారణకు రావాల్సిన సమయం ఆసన్నమైందని.. కుల, మత, వర్గ వివక్ష లేకుండా మనమందరం పురోగమిద్దామ‌ని కేసీఆర్‌ అన్నారు.


Next Story