దేశం కోసం ఆ కుటుంబం చేసిన త్యాగాల ముందు ఏ పార్టీ కూడా పనికిరాదు

CLP Leader Bhatti Vikramarka. ఏ రాజకీయ పార్టీకైనా క్రియాశీలక నిర్మాణం ముఖ్యమ‌ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

By Medi Samrat  Published on  9 Nov 2021 9:22 AM GMT
దేశం కోసం ఆ కుటుంబం చేసిన త్యాగాల ముందు ఏ పార్టీ కూడా పనికిరాదు

ఏ రాజకీయ పార్టీకైనా క్రియాశీలక నిర్మాణం ముఖ్యమ‌ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ శిక్షణా శిబిరంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. వ్యక్తులు, నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కార్యకర్తలే పార్టీకి ముఖ్యమ‌ని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని.. రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ దే అని తెలిపారు. గాంధీయిజమే కాంగ్రెస్ భావజాలం.. సిద్ధాంతం అని అన్నారు. దేశంలో రాజకీయ పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ మాత్రమేన‌ని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎన్నో ఏళ్ళు అధికారంలో లేకున్నా.. ఎన్ని హింసలు పెట్టినా కాంగ్రెస్ జెండా మోస్తున్న ఘనత కార్యకర్తలదని కొనియాడారు.

ప్రధాని అయ్యే అవకాశం సోనియా గాంధీకి వచ్చినా కూడా పార్టీ కోసం త్యాగం చేసిన గొప్ప నాయకురాలని కీర్తించారు. దేశం కోసం ఇందిరమ్మ కుటుంబం చేసిన త్యాగాల ముందు ఏ పార్టీ నాయకులు కూడా పనికిరార‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారంతో బురద జల్లుతున్నాయని.. ప్రస్తుతం మతోన్మాద శక్తుల చేతుల్లో దేశం ఉందని.. కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని పిలుపునిచ్చారు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ ఒకవైపు.. మరోవైపు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్ లను ఓడించాలని.. టీమ్ వర్క్ తోనే గెలుపు సాధ్యమ‌ని భట్టి విక్రమార్క అన్నారు.


Next Story