ప్రతీ నియోజకవర్గంలో 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయండి : సీఎం

కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. సమావేశంలో కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు.

By Medi Samrat
Published on : 14 April 2025 7:29 PM IST

ప్రతీ నియోజకవర్గంలో 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయండి : సీఎం

కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. సమావేశంలో కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు, తాగు నీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించం అన్నారు. ఎక్కడా లోపాలు జరగకుండా చర్యలు తీసుకోండని ఆదేశించారు. భూ భారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. జిల్లాలోని ప్రతీ మండలంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందేన‌న్నారు. చట్టంపై ప్రజలకు సరళంగా వివరించాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని.. ప్రతీ నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని సూచించారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రి ఆమోదం తరువాతే తుది లబ్ధిదారుల జాబితా ప్రకటించాలన్నారు.

తాగునీటి సరఫరా విషయంలో జిల్లాల్లో వేసవి యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలన్నారు. నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించండని సూచించారు. ఎక్కడా తాగు నీటి సమస్య రాకూడదన్నారు. ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుంటూ.. తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండని ఆదేశించారు.

Next Story