ఈ-కార్ రేస్ వ్యవహారంలో సెల్ ఫోన్ అప్పగించాలన్న ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సెల్ఫోన్ స్వాధీనం ప్రాథమిక హక్కులకు(ఫండమెంటల్ రైట్స్), వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని, ఇదే విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చెప్పిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆదేశాలపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించారు. ఏసీబీ అధికారులు ఆదేశించినట్లుగా సెల్ఫోన్ను, ల్యాప్టాప్ను వారికి ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయవాదులు కేటీఆర్కు చెప్పినట్టుగా సమాచారం
కాగా ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సెల్ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ను కూడా అధికారులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా కేటీఆర్ వాడుతున్న సెల్ఫోన్, ల్యాప్టాప్ను తమకు అందజేయాలని ఏసీబీ అధికారులు కోరారు.