విద్యుత్ సరఫరాపై బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రంలో పెరుగుతున్న వినియోగానికి సరిపడా విద్యుత్‌ ఉందని, ఈ పరిస్థితిపై బీఆర్‌ఎస్‌ అబద్ధాలు ప్రచారం చేస్తోందని డిప్యూటీ భట్టి విక్రమార్క మండిపడ్డారు.

By అంజి  Published on  7 May 2024 9:05 AM GMT
BRS, power supply, Telangana,   Deputy CM Bhatti Vikramarka

విద్యుత్ సరఫరాపై బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరుగుతున్న వినియోగానికి సరిపడా విద్యుత్‌ ఉందని, ఈ పరిస్థితిపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అబద్ధాలు ప్రచారం చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. "ఉష్ణోగ్రతలలో మార్పు ఉండవచ్చు. కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఉద్యోగుల సమర్ధవంతంగా పని చేయడం వల్ల, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల వినియోగం పెరుగుతోంది” అని ఎనర్జీ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న భట్టి అన్నారు.

మే 7, మంగళవారం విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. మే 1 నుంచి 6, 2023 తేదీల మధ్య సగటు డిమాండ్, వినియోగ స్థాయిలతో పోలిస్తే, అదే సమయంలో బ్రాకెట్‌లో 2024లో 52.9 శాతం పెరుగుదల ఉంది. ''మే 2023లో సగటు డిమాండ్ 7062 మెగావాట్ల వద్ద ఉంది. ఇది 2024లో 10799 మెగావాట్లకు పెరిగింది. అదే సమయంలో, సగటు వినియోగం గత ఏడాది 157.9 మిలియన్ యూనిట్ల నుంచి 226.62 మిలియన్ యూనిట్లకు పెరిగింది, ఇది 43.5 శాతం పెరిగింది'' అని అన్నారు.

''హైదరాబాద్‌లో గత ప్రభుత్వ హయాంలో 2022-2023 మధ్య విద్యుత్ వినియోగం డిమాండ్ ఒక్క శాతానికి కూడా మించలేదు. ఈ ఏడాది గత రెండు రోజులుగా దాదాపు 4000 మెగావాట్లకు మించి డిమాండ్, 90 మిలియన్ యూనిట్లకు మించి వినియోగం నమోదవుతున్నది. గతంలో ఎప్పుడూ లేనంతగా రాత్రి పూట సరాసరి డిమాండ్ అంచనాలకు మించి నమోదవుతోంది'' అని భట్టి అన్నారు. అయితే ప్రతిపక్షాలు లేని కరెంటు కోతలను ఉన్నట్టు ప్రచారం చేస్తూ గోబెల్స్‌కు తాతలుగా వ్యవహరిస్తున్నారని భట్టి మండిపడ్డారు.

Next Story