బీసీ బిల్లు కోసం నిరాహార దీక్షకు సిద్ధమైన ఎమ్మెల్సీ కవిత..ఎప్పుడంటే?
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ బిల్లు కోసం ఆగస్టు 4,5,6 తేదీల్లో 72 గంటల నిరాహార దీక్ష చేస్తాను..అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు
By Knakam Karthik
బీసీ బిల్లు కోసం 72 గంటల నిరాహార దీక్షకు సిద్ధమైన ఎమ్మెల్సీ కవిత..ఎప్పుడంటే?
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ బిల్లు కోసం ఆగస్టు 4,5,6 తేదీల్లో 72 గంటల నిరాహార దీక్ష చేస్తాను..అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మంగళవారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి కోరి నిరాహారదీక్ష చేస్తాం. ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహార దీక్ కు దిగుతాం. ఉమ్మడి రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహ సాధన కోసం నేను 72 గంటలు దీక్ష చేశాను. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చింది. బీసీ బిల్లు సాధన విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే.. అన్ని పార్టీలతో వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలి..అని కవిత డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫీషియల్గా అఖిలపక్షంను ఢిల్లీకి తీసుకువెళ్లాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న వారి అజెండా బీసీలకు రాజ్యాధికారం రావడం. రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వంపై, ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు సాధించుకోవాలి. 2018 పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ తెలంగాణ జాగృతి చేసిన డిమాండ్ తో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసింది. తమిళనాడులో గవర్నర్ జాప్యం చేస్తే కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్ద పెండింగ్ అంశంపై కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఒప్పందంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయాలి. గవర్నర్, రాష్ట్రపతి వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే మంచి తీర్పు వచ్చింది. మేము వెళ్లి ధర్నా చేస్తాము ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఇది ఏమైనా సత్రం భోజనమా...? అఖిలపక్షం ఢిల్లీకి రావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయండి..అని కవిత డిమాండ్ చేశారు.