చీడపురుగులా బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోంది : ఎమ్మెల్యే దాస్యం

BJP ruining nation like a pest. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు నానా

By Medi Samrat  Published on  26 March 2022 11:36 AM GMT
చీడపురుగులా బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోంది : ఎమ్మెల్యే దాస్యం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శ‌నివారం ఆయ‌న‌ మాట్లాడుతూ.. పంటలను నాశనం చేసే చీడపురుగులా బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. మార్చి 28, 29 తేదీల్లో కార్మిక సంఘం ప్రకటించిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమ్మెకు నాందిగా శనివారం ఇక్కడ అన్ని ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన బైక్ ర్యాలీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌ఐసీ, ఇతర పీఎస్‌యూలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

"కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త కంపెనీలు, ఫ్యాక్టరీల ఏర్పాటు గురించి పట్టించుకోవడం లేదు. కార్మికులు, ఉద్యోగులకు నష్టం కలిగించే ప్రస్తుత కంపెనీలను విక్రయించడంపై దృష్టి సారిస్తోందని"అన్నారాయన. సమ్మెను విజయవంతం చేయడంలో కార్మిక సంఘాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. రెండు రోజుల పాటు జరిగే సమ్మెలో.. మెజారిటీ గుర్తింపు పొందిన, గుర్తింపు లేని కార్మిక సంఘాలు పాల్గొంటున్నందున సమ్మె వేడిని ప్రధాని నరేంద్ర మోదీ తట్టుకోవాలని వినయ్ భాస్కర్ ఆకాంక్షించారు. ఈ ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










Next Story