భద్రాచలాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయ‌లేం : మంత్రి ఎర్రబెల్లి

Bhadrachalam cannot be upgraded as a municipality. రాజ్యాంగపరమైన సమస్యల కారణంగా భద్రాచలాన్ని మున్సిపాలిటీగా

By Medi Samrat  Published on  11 Feb 2023 12:33 PM GMT
భద్రాచలాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయ‌లేం : మంత్రి ఎర్రబెల్లి

రాజ్యాంగపరమైన సమస్యల కారణంగా భద్రాచలాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసే అవకాశం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం స్పష్టం చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు-2023ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా.. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అడిగిన ప్రశ్నకు మంత్రి దయాకర్ రావు సమాధానమిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243జెడ్‌సి3లోని పార్ట్‌-ఎ ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంత విస్తరణకు అనుమతి లేదని, అందుకే భద్రాచలం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రాచలాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తోందని, అయితే రాజ్యాంగం అనుమతించనందున అది చేయలేమని ఆయన అన్నారు.

లక్ష దాటిన భద్రాచలం జనాభాను బట్టి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి అంగీకరించారు. కానీ రాజ్యాంగపరమైన అడ్డంకులు కారణంగా ప్రభుత్వం నిస్సహాయంగా ఉందని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ఈ విధ‌మైన డిమాండ్‌లు ఉన్నాయని.. వాటిని కూడా మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయలేకపోయార‌ని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. భద్రాచలం గ్రామపంచాయతీ 1962లో ఏర్పాటై.. ఆ తర్వాత మేజర్ గ్రామపంచాయతీగా అప్‌గ్రేడ్ చేయబడింది. స్థానిక సంస్థల‌కు చివరిసారిగా 2013లో ఎన్నికలు జరగ్గా.. 2018లో పదవీకాలం పూర్తయింది.

Next Story