రేపటి నుంచే ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్, వారికి మాత్రమే

ఆయుష్మాన్ భారత్ వయో వందన పథకం ద్వారా 70ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది.

By Knakam Karthik
Published on : 31 March 2025 11:14 AM IST

National News, Union Government, Ayushman Bharat

రేపటి నుంచే ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్, వారికి మాత్రమే

ఆయుష్మాన్ భారత్ వయో వందన పథకం ద్వారా 70ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది. రేపటి నుంచి ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీం అమలు కానుంది. ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. కాగా రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోనూ అమల్లోకి రానుంది.

దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమా అందించనుంది. ఇందులో ఉచిత చికిత్సతో పాటు సర్జరీలు, మెడిసిన్ అందించనుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు 416 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో తాజాగా ఆదేశాలు కూడా ఇచ్చారు . కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆరోగ్య బీమా ఎన్నో ఆసుపత్రులు లింక్‌ అయి ఉన్నాయి. ప్రభుత్వం నేరుగా ఆస్పత్రులకు బిల్లు చెల్లిస్తుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులెవరు?

అయితే దీనికి ముందుగా ఆయుష్మాన్ భారత్ యోజనాలలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనలో భారత్ శాశ్వత నివాసితులై ఉన్నవారు మాత్రమే అర్హులు. అప్పుడే ఈ పథకం లబ్ధి పొందుతారు. సీనియర్ సిటిజెన్‌లు 70 ఏళ్లు పైబడిన వారు కూడా అర్హులు, వీళ్ళు కార్డు కలిగి ఉండాలి. ఆదాయం అర్బన్, రూరల్ ఏరియాలకు నిర్దేశిత ఆదాయ పరిమితిని మించి ఉండకూడదు. ఆయుష్మాన్ భారత్ యోజన కార్డు కలిగి ఉంటే ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమాను పొందుతారు. ఉచిత చికిత్సలు పొందుతారు. ఉచితంగా మెడిసిన్స్ అందిస్తారు. ఎమర్జెన్సీ ఇతర సర్వీసులు కూడా పొందుతారు. ఇవన్నీ నిరుపేద కుటుంబాలకు వర్తిస్తాయి. మీరు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ యోజన పొందాలంటే అధికారిక వెబ్‌సైటులో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. అక్కడ మీ ఆధార్ కార్డు ఇతర వివరాలు నమోదు చేసి వెరిఫికేషన్ చేస్తే ఆధార్ కార్డు పొందుతారు.

ఈ పథకం ద్వారా ఏడాదికి ఐదు లక్షలు ఆరోగ్య బీమా అందిస్తారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన -2025 స్కీమ్ కింద ఈ పథకానికి వయసు ఒక్కటే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 70ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డు పొందడానికి అర్హులు. ఇది వరకు వయస్సు పెద్ద ఉన్నవారికి ఆరోగ్య బీమా ప్రైవేటు రంగాలు అవకాశం ఇచ్చేవి కావు.

Next Story