ఆరేపల్లి మోహన్ బీఆర్ఎస్ ను వీడబోతున్నారా.?

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ బీఆర్ఎస్ ను వీడబోతున్నట్లు తెలుస్తోంది.

By Medi Samrat  Published on  6 Sep 2023 4:21 PM GMT
ఆరేపల్లి మోహన్ బీఆర్ఎస్ ను వీడబోతున్నారా.?

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ బీఆర్ఎస్ ను వీడబోతున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాడు ఆరేపల్లి మోహన్ తన అనుచరులతో సమావేశమయ్యారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆరేపల్లి మోహన్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగారు. కానీ, 2019 మార్చి 17న ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల ముందు మోహన్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన ఆరేపల్లి మోహన్ కు నామినేట్ పదవులు దక్కుతాయని ఆశించారు. ఎమ్మెల్సీ పదవి లేదా నామినేట్ పదవి వస్తుందని మోహన్ భావించారు. కానీ మోహన్ కు బీఆర్ఎస్ నాయకత్వం నుండి ఎలాంటి హామీ దక్కలేదు. మోహన్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మానకొండూరు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కవ్వంపల్లి సత్యనారాయణ దిగే అవకాశం ఉండడంతో ఆరేపల్లి మోహన్ తో బీజేపీ నాయకులు ఇప్పటికే రెండు దఫాలు చర్చించినట్టుగా సమాచారం. మోహన్ కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా కీలక ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం సాగుతుంది. ఆరేపల్లి మోహన్ ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం చర్చ సాగుతుంది. మోహన్ అనుచరులు కూడా బీఆర్ఎస్ ను వీడడమే మంచిదని సమావేశాల్లో చెప్పినట్లు తెలుస్తోంది.

Next Story