తెలంగాణలో బీజేపీ గెలిస్తే అయోధ్య రామమందిరానికి ఫ్రీ జర్నీ: అమిత్ షా

తెలంగాణలో బీజేపీ గెలిస్తే, అయోధ్య రామమందిరాన్ని ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు చెప్పారు.

By అంజి  Published on  19 Nov 2023 1:25 AM GMT
Amit Shah, free travel, Ayodhya, Ram Mandir, BJP , Telangana

తెలంగాణలో బీజేపీ గెలిస్తే అయోధ్య రామమందిరానికి ఫ్రీ జర్నీ: అమిత్ షా

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) మేనిఫెస్టో విడుదలకు ముందు పార్టీ గెలిస్తే, అయోధ్య రామమందిరాన్ని ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు చెప్పారు. నవంబర్ 18, శనివారం నాడు గద్వాల్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ.. వచ్చే ఏడాది జనవరి 22న ప్రజల కోసం ప్రారంభించాలని భావిస్తున్న రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘనత వహించారని తెలిపారు.

రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ 70 ఏళ్లుగా అన్యాయంగా జాప్యం చేసింది. మోదీ ప్రభుత్వం జనవరి 22, 2024న ఆలయాన్ని ప్రజల కోసం తెరవనుంది. మీరందరూ ముఖ్యంగా మహిళలు ఆలయాన్ని దర్శనం కోసం సందర్శించకూడదా? అది మీకు ఖర్చు కాదా? కానీ చింతించకండి. కమలదళానికి ఓటు వేయండి, తెలంగాణా బీజేపీకి ప్రతి ఒక్కరు రామమందిరాన్ని ఉచితంగా సందర్శించేలా చూస్తామని అమిత్ షా అన్నారు.

తెలంగాణలో బీజేపీ పోటీదారులైన బీఆర్‌ఎస్, ఏఐఎంఐఎం, కాంగ్రెస్‌లపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఆయన వారిని '2G, 3G, 4G పార్టీలు' అని పిలిచారు, వారి ప్రస్తుత నాయకులు వరుసగా ఒకే కుటుంబానికి చెందిన రెండవ, మూడవ, నాల్గవ తరం రాజకీయ నాయకుల నుండి వచ్చారు అని అన్నారు.

శనివారం గద్వాల్, నల్గొండ, వరంగల్‌లో రోజంతా బహిరంగ సభల్లో ప్రసంగించిన అనంతరం సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌లో అమిత్ షా అధ్యక్షతన బీజేపీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. రాష్ట్రంలో నవంబర్ 30న ఓటింగ్ రోజు జరగనుండగా, తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మునుపటి 2018 ఎన్నికల్లో, వివాదాస్పద ఎమ్మెల్యే రాజాసింంగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ సమీపంలోని గోషామహల్‌లో బీజేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో బీజేపీ 6.98% ఓట్లను మాత్రమే పొందగలిగింది. టీఆర్‌ఎస్‌కు 46.87%, కాంగ్రెస్‌కు 28.43% ఓట్లు వచ్చాయి.

Next Story