భద్రాద్రిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం

All is set for Teppotsavam at Bhadradri. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని భద్రాచలం సీతా రామచంద్ర స్వామి దేవస్థానం వైకుంట ఏకాదశి ప్రయుక్త

By Medi Samrat  Published on  1 Jan 2023 3:12 AM GMT
భద్రాద్రిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని భద్రాచలం సీతా రామచంద్ర స్వామి దేవస్థానం వైకుంట ఏకాదశి ప్రయుక్త ఆద్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గోదావరి నదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముక్కోటి ఉత్సవాల సందర్భంగా భక్తులకు విక్రయించేందుకు దాదాపు 1.25 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తెప్పోత్సవం సజావుగా జరిగేలా చూడాలని, అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హంసవనంలోకి అనుమతి పొందిన అర్చకులు, అధికారులు, వీఐపీలను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. భక్తులను గోదావరి నదిలోకి అనుమతించకూడదు. నిపుణులైన స్విమ్మర్లు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వేడుకల సందర్భంగా దాదాపు 400 మంది పారిశుధ్య కార్మికులు పరిశుభ్రత కోసం నిమగ్నమై ఉన్నారని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. భద్రాచలం ఆర్డీఓ రత్న కళ్యాణి, ఇతర అధికారులు శనివారం గోదావ‌రి నది వద్ద నిర్మించిన హంసవాహనం, చెక్క రేవును పరిశీలించి లైటింగ్‌, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.


Next Story