తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. జీహెచ్ఎంసీ, ఖ‌మ్మంలో అత్య‌ధిక కేసులు

645 New Corona Cases reported In Telangana. తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,23,166

By Medi Samrat  Published on  27 July 2021 2:01 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. జీహెచ్ఎంసీ, ఖ‌మ్మంలో అత్య‌ధిక కేసులు

తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,23,166 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 645 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,42,436కి చేరింది. నిన్న ఒక్క రోజే క‌రోనాతో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,791కి పెరిగింది. నిన్న 729 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,29,408కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 9,237 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 72, ఖ‌మ్మంలో 72 కేసుల చొప్పున‌ నమోదు అయ్యాయి.



Next Story