తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
494 New Corona Cases Reported In Telangana. తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 91,457 శాంపిళ్లను
By Medi Samrat Published on
25 July 2021 5:10 PM GMT

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 91,457 శాంపిళ్లను పరీక్షించగా.. 494 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,41,153కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,784కి పెరిగింది. నిన్న 710 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,27,964కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,405 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 76 కేసులు నమోదు అయ్యాయి.
Next Story