తెలంగాణలో మ‌ళ్ళీ పెరిగిన క‌రోనా కేసులు

491 Corona Cases In Telangana. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక రోజు కేసులు తగ్గుతూ ఉంటే

By Medi Samrat  Published on  15 Dec 2020 4:02 AM GMT
తెలంగాణలో మ‌ళ్ళీ పెరిగిన క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక రోజు కేసులు తగ్గుతూ ఉంటే మరొక రోజు కాస్త పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 491 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,78,599 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1499 మంది మృతి చెందారు. తాజాగా 596 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,69,828 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,272 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 5,169 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 96.85శాతం ఉండగా, దేశంలో 95.1 శాతం ఉంది. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 102 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


Next Story