తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
427 New Corona Cases Reported In Telangana. తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,509
By Medi Samrat Published on
13 Aug 2021 3:19 PM GMT

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,509 శాంపిళ్లను పరీక్షించగా.. 427 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,715కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,838కి పెరిగింది. నిన్న 609 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,40,065కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7812 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.21 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 68 కేసులు నమోదైనట్లు తెలిపింది.
Next Story