తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
417 New Corona Cases Reported In Telangana. తెలంగాణలో నిన్నటితో పోల్చితే కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో
By Medi Samrat Published on
17 Aug 2021 3:03 PM GMT

తెలంగాణలో నిన్నటితో పోల్చితే కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 87,230 శాంపిళ్లను పరీక్షించగా.. 417 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,53,202కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,847కి పెరిగింది. నిన్న 569 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,42,416కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,939 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.34 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
Next Story