తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
340 New Corona Cases Reported In Telangana. తెలంగాణలో నిన్నటితో పోల్చితే కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24
By Medi Samrat Published on 30 Aug 2021 2:09 PM GMT
తెలంగాణలో నిన్నటితో పోల్చితే కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 75,102 శాంపిళ్లను పరీక్షించగా.. 340 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,716కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,872కి పెరిగింది. నిన్న 359 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,47,953కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.51 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) August 30, 2021
(Dated.30.08.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/yCQ4ZR9Bfu