తెలంగాణలో కొత్తగా 338 కరోనా పాజిటివ్ కేసులు
338 New Corona Cases reported In Telangana. తెలంగాణలో నిన్నటితో పోల్చితే కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్
By Medi Samrat Published on
31 Aug 2021 2:26 PM GMT

తెలంగాణలో నిన్నటితో పోల్చితే కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 73,207 శాంపిళ్లను పరీక్షించగా.. 338 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,58,054కి చేరింది. నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,873కి పెరిగింది. నిన్న 364 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,48,317కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,864 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.48 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
Next Story