ఉక్రెయిన్ నుండి న్యూఢిల్లీ చేరుకున్న మ‌రో 30 మంది తెలంగాణ‌ విద్యార్థులు

30 more Telangana students reach New Delhi from Ukraine. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన‌ 30 మంది విద్యార్థులు బుధవారం ఉక్రెయిన్ నుండి

By Medi Samrat  Published on  2 March 2022 2:45 PM GMT
ఉక్రెయిన్ నుండి న్యూఢిల్లీ చేరుకున్న మ‌రో 30 మంది తెలంగాణ‌ విద్యార్థులు

తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన‌ 30 మంది విద్యార్థులు బుధవారం ఉక్రెయిన్ నుండి న్యూఢిల్లీ చేరుకున్నారు. విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దును దాటి రొమేనియాకు వెళ్లి.. భారత రాయబార కార్యాలయం సహాయంతో భారతదేశానికి చేరుకున్నారు. రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విద్యార్థులను తరలించారు. ఢిల్లీ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆహ్వానించారు. అనంత‌రం విద్యార్థులను తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లిన అధికారులు అక్కడ వారికి భోజనం, వసతి కల్పించారు.

హైదరాబాద్‌కు వెళ్లేందుకు అధికారులు వారికి ఉచిత విమాన టిక్కెట్లు కూడా ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం విద్యార్థులు రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన 97 మంది వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు యుద్ద పీడిత దేశం ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి తమ స్వస్థలాలకు చేరుకోవడానికి విద్యార్థులకు ఉచిత విమాన టిక్కెట్లు అందించడమే కాకుండా బస్సు టిక్కెట్లను కూడా ఉచితంగా అందజేస్తున్నారు. సోమవారం ఉక్రెయిన్ సరిహద్దు దాటిన 11 మంది తెలంగాణ విద్యార్థులు రొమేనియా నుంచి దేశానికి చేరుకున్నారు.


Next Story