తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
258 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుతోంది. గడిచిన 24 గంటల్లో
By Medi Samrat Published on
22 Sep 2021 2:40 PM GMT

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుతోంది. గడిచిన 24 గంటల్లో 55,419 శాంపిళ్లను పరీక్షించగా.. 258 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,164కి చేరింది. నిన్న కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,908కి పెరిగింది. నిన్న 249 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,55,310కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.66 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
Next Story