విద్యుత్‌ సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

24-hour uninterrupted power supply to agri sector. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని

By Medi Samrat  Published on  15 April 2022 7:57 AM GMT
విద్యుత్‌ సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి ప్రభాకర్ రావు తెలిపారు. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వ్యవసాయ రంగంలోని కొన్ని పరిమితుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని నివేదికల నేఫ‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని.. శుక్రవారం నుండి వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున విద్యుత్‌ సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్‌ ఇస్తూ రైతుల అవసరాలు తీరుస్తున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు.







Next Story