బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత

20 students fall ill due to food poisoning in Narayankhed. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించిన మరో కేసు వెలుగుచూసింది.

By Medi Samrat
Published on : 5 Nov 2022 3:03 PM IST

బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినులకు అస్వస్థత

రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించిన మరో కేసు వెలుగుచూసింది. నారాయణఖేడ్‌లోని బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో శనివారం 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు నారాయణఖేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. చాలా మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు.


Next Story