సెప్టెంబర్ 1 నుండే తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2020 1:37 PM GMT
సెప్టెంబర్ 1 నుండే తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభం

కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో సెప్టెంబర్‌ 1 నుంచి పాఠ‌శాల‌ల్లో 2020-2021 విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం అవుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కేంద్రం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారమే ఈ త‌ర‌గ‌తులు ఉంటాయ‌ని.. మూడో త‌ర‌గ‌తి, ఆపై స్థాయి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. టీశాట్, దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోదించనున్నారు. ఇప్పటికే ఆయా ఛానళ్లతో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు స్కూళ్ల‌కు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా విద్యా సంవ‌త్స‌రం ప్రారంభంపై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం ఈ నెల 5న భేటీ జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నాయి.

Next Story