మా ఆయుష్షు పెంచాలని.. యముడికి పోలీసుల లేఖ.. వైరల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2020 7:09 AM GMT
మా ఆయుష్షు పెంచాలని.. యముడికి పోలీసుల లేఖ.. వైరల్‌

చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇక మనదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 60వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారిపై పోరులో ప్రజలను రక్షించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న వారిలో డాక్టర్లు, పోలీసులు ముందు ఉన్నారు. విధి నిర్వహాణలో పోలీసులు కరోనాకు బలి అవుతున్నారు. వైరస్‌ సోకి ఇప్పటికే చాలా మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. తమను జీవితకాలాన్ని కాపాడాలని ఏకంగా యముడికి లేఖ రాసారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

"మేము ఎన్ని కష్టాలు అనుభవించినా.. ప్రజల ప్రాణాలు కాపాడటమే మా అంతిమ లక్ష్యం. కాబట్టి మా జీవిత కాలాన్ని దయాగుణంతో పొడిగించాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఈ దేశానికి ఉపయోగపడే మరణం మాకు ఉందని భరోసా ఇవ్వండి. అలాంటి మరణమే మాకు కావాలి. ఈ లేఖ తరువాత పోలీసుల మరణాలపై దయ చూపిస్తారని నమ్ముతున్నాం. " అని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story