మహిళల వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో సెమీస్లో టీమిండియా ప్రత్యర్థి తేలిపోయింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్ అక్టోబర్ 30న సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. లారా వోల్వార్డ్ట్ (31), సినాలో జాఫ్తా (29), నాడిన్ డిక్లర్క్ (14) మినహా మరే బ్యాటర్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. 98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ విజయంతో ఆస్ట్రేలియా 7 మ్యాచ్లలో 6 విజయాలు, 13 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (13), దక్షిణాఫ్రికా (10), ఇంగ్లాండ్ (9), భారత్ (6) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్లో భారత్ గెలిచినా 8 పాయింట్లతో నాలుగో స్థానంలోనే ఉంటుంది. నిబంధనల ప్రకారం, ఒకటో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో, నాలుగో స్థానంలో ఉన్న భారత్ సెమీస్లో తలపడనున్నాయి.