కోహ్లీ కుమారైకు అత్యాచార‌ బెదిరింపు.. హైద‌రాబాద్‌కు చెందిన వ్య‌క్తి ప‌నే..!

Virat daughter Vamika gets rape threats.ఆట‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. అయిన‌ప్ప‌టికి ఒక్కోసారి అభిమానులు ఓట‌ముల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Nov 2021 3:39 AM GMT
కోహ్లీ కుమారైకు అత్యాచార‌ బెదిరింపు..  హైద‌రాబాద్‌కు చెందిన వ్య‌క్తి ప‌నే..!

ఆట‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. అయిన‌ప్ప‌టికి ఒక్కోసారి అభిమానులు ఓట‌ముల‌ను జీర్ణించుకోలేక బాధ‌ప‌డుతూ విమ‌ర్శించ‌డం స‌ర్వ‌సాధార‌మే. మెగా టోర్నీల్లో ఓడిన‌ప్పుడు ఆట‌గాళ్ల ఇంటిపై రాళ్లు రువ్విన ఘ‌ట‌న‌ల‌ను మ‌నం చూశాం. అయితే.. తాజాగా జ‌రుగుతున్న టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా ప్ర‌ద‌ర్శ‌న దారుణంగా ఉంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జ‌ట్ల‌తో జ‌రిగిన మ్యాచ్‌ల్లో క‌నీసం పోరాడ‌కుండానే ఆటగాళ్లు చేతులెత్తేశారు.

దీంతో ఆట‌గాళ్ల‌పై విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ప్రధానంగా టీమ్ఇండియా కెప్టెన్‌ విరాట్​ కోహ్లీ, పేసర్ మహ్మద్​ షమిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. మత విద్వేషాన్ని ఎదుర్కొంటున్న షమికి కోహ్లీ అండగా నిల‌వ‌డంతో.. ఇప్పుడు కోహ్లీ బాధితుడిగా మారాడు. అత‌డి భార్య అనుష్క శ‌ర్మ‌, తొమ్మిది నెల‌ల చిన్నారి వామిక ను కూడా ఇందులోకి లాగుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా.. మానవత్వాన్ని మంటగలిపేలా.. అన్ని హద్దులూ దాటుతూ అభం శుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. చిన్నారి వామిక‌ను అత్యాచారం చేస్తానంటూ ఓ నెటిజ‌న్ చేసిన కామెంట్లు సంచ‌ల‌నంగా మారాయి.

అస‌లేం జ‌రిగిందంటే.. పాక్‌తో ఓట‌మి అనంత‌రం ప‌లువురు ష‌మీ మ‌తాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని విప‌రీత వ్యాఖ్య‌లు చేశారు. ష‌మీ ముస్లిం కావ‌డం వ‌ల్ల.. అత‌డు పాకిస్థాన్ గెల‌వాల‌ని కోరుకున్నాడ‌ని.. అందుక‌నే ద‌గ్గ‌రుండి పాక్‌ను గెలిపించాడ‌ని సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు. కాగా.. దీన్ని రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు క్రీడాకారులు ఖండించారు. ష‌మీకి మ‌ద్దుతుగా నిల‌బ‌డిన సంగ‌తి తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ష‌మీకి మ‌ద్దుతుగా మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్య‌లు చేస్తున్న వారిని అత‌డు వెన్న‌ముక‌లేని వాళ్లుగా అభివ‌ర్ణించాడు.

దీంతో వారికి కోహ్లీ టార్గెట్‌గా మారాడు. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో కోహ్లీ కూతురిని అత్యాచారం చేస్తామంటూ దుండగులు కామెంట్లు పెట్టారు.' కోహ్లీ, అనుష్క.. మీరు సిగ్గుతో తలదించుకోవాలి.. మీ కూతురు(వామిక) ఫొటోలను ఎప్పుడెప్పుడు చూపిస్తారా.. ఎప్పుడు తనను రేప్ చేస్తానా అని ఎదురు చేస్తున్నా..'అంటూ క్రిక్ క్రేజీ గర్ల్స్ అనే ట్విటర్ యూజర్ కామెంట్లు చేశాడు. స‌ద‌రు యూజ‌ర్ చేసిన కామెంట్ల‌పై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. అలాంటి వ్యాఖ్య‌లు చేసిన స‌ద‌రు వ్య‌క్తిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యాఖ్య‌లు చేసింది తొలుత పాకిస్థాన్ కు చెందిన వార‌ని ప్ర‌చారం సాగినా.. ఫ్యాక్ట్ చెకర్, ప్రఖ్యాత ఆల్ట్ న్యూస్ కో-ఫౌండరైన మొహ్మద్ జుబేర్ మాత్రం అత‌డిది హైదరాబాదే అని చెబుతున్నారు. క్రిక్ క్రేజీ గర్ల్స్, రమన్ హెయిస్ట్, పెళ్లికూతురుహిరయ్ అనే పేర్లు గల ట్విటర్ అకౌంట్లతో ట్రోలింగ్ కు పాల్పడుతోన్న వ్యక్తి ఒకడేనని.. ఆ మూడు అకౌంట్లకు డేటా యూజర్ ఐడీ ఒకటేనని, ఆ వ్యక్తి హైదరాబాద్ కు చెందిన‌వాడేన‌ని తేల్చేశాడు.

Next Story