చారిత్రాత్మక విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్ర‌జ‌లు.. వీడియో వైర‌ల్‌..!

ఎవరూ ఊహించని క్రికెట్‌ను ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచానికి చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.

By Medi Samrat  Published on  25 Jun 2024 12:03 PM GMT
చారిత్రాత్మక విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్ ప్ర‌జ‌లు.. వీడియో వైర‌ల్‌..!

ఎవరూ ఊహించని క్రికెట్‌ను ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచానికి చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. సూపర్-8లో రషీద్ ఖాన్ సారథ్యంలోని జట్టు తొలుత ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది. ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి.

ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ఆఫ్ఘనిస్థాన్ క్రికెట‌ర్లను అంద‌రూ మెచ్చుకున్నారు. జట్టు మొత్తం విజయ సంబరాల్లో మునిగిపోయింది. ఆఫ్ఘన్ ఆటగాళ్లు మైదానం అంతా ప‌రిగెడుతూ సంతోషం వ్య‌క్తం చేశారు. అఫ్గానిస్థాన్‌ ఈ తరహా ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరుకుంటుందని ఎవరూ ఊహించలేదు. ఈ విజయాన్ని మైదానంలోనే కాకుండా ఆ దేశ‌ ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో కూడా జరుపుకున్నారు.

రషీద్ ఖాన్ సారథ్యంలోని జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించిన వెంటనే.. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ప్రజలు ఆఫ్ఘన్ జెండాల‌తో తమ జట్టును ఉత్సాహపరిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన‌ అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇందులో వీధుల్లో ప్రజల గుంపు స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్లపై కాలు పెట్టేందుకు కూడా స్థలం లేదు. నాయకుడి ప్రసంగం వినడానికి లేదా గాయకుడి సంగీత కచేరీకి జనం వచ్చినట్లు జనం ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన‌ ఆఫ్ఘనిస్తాన్ 115 పరుగులు చేసి ఐదు వికెట్లను కోల్పోయింది. వర్షం-అంతరాయం క‌లిగించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 19 ఓవర్లలో 114 పరుగుల లక్ష్యం చేధించాల్సివుంది. అయితే 17.5 ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు 105 పరుగుకే కుప్పకూలింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌ను ఎనిమిది పరుగుల తేడాతో గెలిచి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్టులో నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ ఒక్కొక్కరూ నాలుగు వికెట్లు తీశారు.


Next Story