ఆ మ్యాచ్‌లో స్నేహితుల మ‌ధ్య పోరు ఉండ‌బోతుంది..!

2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ఫిబ్రవరి 7న భారత్-అమెరికా మధ్య జరగనుంది.

By -  Medi Samrat
Published on : 3 Feb 2026 6:50 PM IST

ఆ మ్యాచ్‌లో స్నేహితుల మ‌ధ్య పోరు ఉండ‌బోతుంది..!

2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ఫిబ్రవరి 7న భారత్-అమెరికా మధ్య జరగనుంది. ఆ రోజున ఇద్దరు సన్నిహితులు ఒకరిపై ఒకరు తలపడతారు. అవును, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అమెరికన్ ఆల్ రౌండర్ శుభం రంజనే సన్నిహితులు. ఈ ఇద్దరి మధ్య ఉత్కంఠభరితమైన పోరాటం జరగబోతోంది.

శుభం రంజనే తొలిసారి T20 ప్రపంచ కప్‌లో ఆడ‌నున్నాడు. అతడు USA తరపున ప్రాతినిధ్యం వహిస్తాడు. అమెరికాలో స్థిరపడటానికి ముందు శుభం ముంబై తరఫున క్రికెట్ ఆడేవాడు. సూర్యకుమార్ యాదవ్ తనకు ప్రత్యేకమైన స్నేహితుడు.. అన్నయ్య లాంటివాడని చెప్పాడు.

రంజనే టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. సూర్య నాకు చాలా దగ్గరి స్నేహితుడు. అతను నాకు సోదరుడిలాంటివాడు. క్రికెట్ మైదానం వెలుపల మేము చాలా సమయం కలిసి గడిపాము. మా ఇద్దరికీ కలిసి ప్రయాణించిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మేము లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లి చాలా సరదాగా గడిపేవాళ్ళం. కాబట్టి ఇది క్రికెట్ గురించి మాత్రమే కాదు. అతను నా అన్నయ్య లాంటివాడు.. నాకు ప్రేరణ.. "ముంబైకి తిరిగి రావడం ఎప్పుడూ ఇంటికి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. మైదానంలో క్రికెట్‌తో సహా నా జీవితాంతం ఇక్కడే ఆడాను" అని రంజనే అన్నాడు. ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.

శుభం రంజనే 2022లో అమెరికాకు వెళ్లాబు. 31 ఏళ్ల రంజనే బిగ్-హిటింగ్ కు ప్రసిద్ధి చెందాడు. మీడియం-పేస్ బౌలర్ కూడా. అతని తాత వసంత్ రంజనే 1958, 1964 మధ్య భారతదేశం తరపున ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అతని తండ్రి సుభాష్ రంజనే ఇండియా A తరపున ప్రాతినిధ్యం వహించాడు. మహారాష్ట్రకు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్. శుభం రంజనే 15 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి 595 పరుగులు చేశాడు, అందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది.

Next Story