రోహిత్, కోహ్లీ.. అతడికే బలయ్యారు

ఆసియా కప్ 2023లో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు పాక్ పేసర్ షాహీన్ అఫ్రీది షాకిచ్చాడు.

By Medi Samrat  Published on  2 Sep 2023 11:05 AM GMT
రోహిత్, కోహ్లీ.. అతడికే బలయ్యారు

ఆసియా కప్ 2023లో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు పాక్ పేసర్ షాహీన్ అఫ్రీది షాకిచ్చాడు. రోహిత్ శర్మ 11 పరుగులు చేసి షాహీన్ షా అఫ్రీది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ అద్భుతమైన కవర్ డ్రైవ్ తో ఖాతా తెరవగా.. ఆ తర్వాత షాహీన్ బౌలింగ్ లో ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని బౌల్డ్ అయ్యాడు. 27 పరుగుల వద్ద భారత్ మొదటి రెండు వికెట్లు కోల్పోయింది.

ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలెలో జరుగుతున్న మ్యాచ్ ను వరుణుడు అడ్డుపడుతూ ఉన్నాడు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశారు. 4.2 ఓవర్ల వద్ద మ్యాచ్ కు వర్షం విఘాతం కలిగించింది. వర్షం ప్రారంభం కావడంతో గ్రౌండ్ స్టాఫ్ మైదానాన్ని కవర్లతో కప్పేశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి టీమిండియా 4.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్ మొదలుపెట్టగా.. షాహీన్ అద్భుతమైన బౌలింగ్ తో రోహిత్, కోహ్లీని పెవిలియన్ కు పంపాడు.

Next Story