ఫిట్‌గా ఉన్నాడు.. మరికొన్ని సీజన్లు ఆడుతాడు : ధోనీ రిటైర్‌మెంట్‌పై రోహిత్‌ శర్మ

Rohit Sharma Gives BIG Update On MS Dhoni’s Future In T20 League. ఐపీఎల్-2023 తర్వాత ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ అవుతాడ‌నే వార్త‌ల‌పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.

By Medi Samrat  Published on  29 March 2023 12:19 PM GMT
ఫిట్‌గా ఉన్నాడు.. మరికొన్ని సీజన్లు ఆడుతాడు : ధోనీ రిటైర్‌మెంట్‌పై రోహిత్‌ శర్మ

Rohit Sharma Gives BIG Update On MS Dhoni’s Future In T20 League


ఐపీఎల్-2023 తర్వాత ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ అవుతాడ‌నే వార్త‌ల‌పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని చాలా ఫిట్‌గా ఉన్నాడని.. వచ్చే రెండు-మూడు సీజన్లలో ఆడగలడని రోహిత్ శర్మ చెప్పాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం ప్రధాన కోచ్ మార్క్ బౌచర్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించాడు.. 'ఎంఎస్ ధోనీ త‌న చివరి సీజన్ ఆడుతున్నాడ‌ని నేను గత రెండు-మూడేళ్లుగా వింటున్నాను. కానీ, ధోనీ మరికొన్ని సీజన్లు ఆడేందుకు సరిపోతాడని నేను భావిస్తున్నానని అన్నాడు.

MS ధోని IPLలో చెన్నై సూపర్ కింగ్స్ విజ‌యాల్లో కీలక పాత్ర పోషించాడు. చాలా సంవత్సరాలుగా జట్టు విజయానికి గణనీయంగా దోహదపడ్డాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 234 మ్యాచ్‌ల్లో 4,978 పరుగులు చేసిన ధోనీ.. జట్టుకు నాలుగు టైటిళ్లను కూడా అందించాడు. ఐపీఎల్ 2023 ఎంఎస్ ధోనీకి చివరి సీజన్ కావచ్చని భావిస్తున్నారు. మూడేళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. తమ సొంత మైదానంలో మ్యాచ్ ఆడనుంది. MS ధోని ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడు. ఎంఎస్ ధోని నెట్స్‌లో బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు స్టేడియం మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో మార్చి 31న ఆడనుంది.

ముంబై ఇండియన్స్ తొలి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'గత 10 ఏళ్లుగా నేను ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాను. జట్టుతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, ఏదైనా ఒక జ్ఞాపకాన్ని పిన్ చేయడం కష్టం. జట్టులో నా ప్రతిభను పెంచుకునే అవకాశం ఇచ్చారు. జట్టు నన్ను మొదట మెరుగైన ఆటగాడిగా, ఆపై మంచి నాయకుడిగా చేసిందని పేర్కొన్నాడు.


Next Story