సెంచ‌రీతో గర్జించిన జైస్వాల్.. ముంబై ఘోర ప‌రాజ‌యం

IPL 2024 38వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

By Medi Samrat  Published on  23 April 2024 2:00 AM GMT
సెంచ‌రీతో గర్జించిన జైస్వాల్.. ముంబై ఘోర ప‌రాజ‌యం

IPL 2024 38వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ 18.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 183 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజ‌యంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ స్థానం మరింత పటిష్టంగా మారింది. జట్టు 14 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. కాగా, ముంబై ఏడో స్థానంలో ఉంది. జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి.

180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ కు శుభారంభం లభించింది. బ్యాటింగ్‌కు దిగిన యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ లు తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పీయూష్ చావ్లా ఏడో ఓవర్‌లో జోస్ బట్లర్‌ను అవుట్ చేశాడు. గత మ్యాచ్‌లో విజేతగా నిలిపిన‌ బట్లర్ ముంబైపై ఆరు ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఆ తర్వాత జైస్వాల్‌తో కలిసి 109 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన సంజూ శాంసన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ముంబై ఇండియన్స్‌పై యశస్వి జైస్వాల్ బ్యాట్ భీకరంగా గర్జించాడు. అతడు జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ వంటి బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బలమైన సెంచరీని కొట్టాడు. ఇందుకోసం యువ బ్యాట్స్‌మెన్ 59 బంతులు ఆడాడు. ఈ సీజన్‌లో జైస్వాల్‌కి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇది కాకుండా అతని ఐపీఎల్ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల బ్యాట్స్‌మెన్ జైస్వాల్ మొత్తం 60 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. కాగా, శాంసన్ రెండు ఫోర్లు, సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. బ్యాట్స్‌మెన్‌లిద్దరూ చివరి వరకు నాటౌట్‌గా నిలిచారు.

Next Story