వినూ మన్కడ్ ట్రోఫీ.. ఆ జట్టుకు కెప్టెన్గా రాహుల్ ద్రావిడ్ కుమారుడు
వినూ మన్కడ్ ట్రోఫీ కోసం కర్ణాటక అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు.
By - Knakam Karthik |
వినూ మన్కడ్ ట్రోఫీ.. ఆ జట్టుకు కెప్టెన్గా రాహుల్ ద్రావిడ్ కుమారుడు
టీమిండియా దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ వారసత్వాన్ని ఆయన చిన్న కుమారుడు అన్వయ్ ద్రావిడ్ కొనసాగిస్తున్నాడు. దేశీయ జూనియర్ క్రికెట్లో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్న అన్వయ్, తాజాగా జరుగబోయే వినూ మన్కడ్ ట్రోఫీ కోసం కర్ణాటక అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. బ్యాటింగ్లో స్థిరత, నాయకత్వంలో నైపుణ్యం ప్రదర్శించిన అన్వయ్కు సెలక్టర్లు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.
ఇటీవలి కాలంలో అన్వయ్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. ముఖ్యంగా అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో తన ప్రతిభను చాటాడు. కేవలం ఆరు మ్యాచ్లోనే 459 పరుగులు చేసి, 91.80 సగటుతో రాణించాడు. ఇందులో రెండు శతకాలు సాధించడం అతని స్థిరమైన ఆటతీరును స్పష్టంగా చూపిస్తుంది. గత సీజన్లో కర్ణాటక తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచిన అన్వయ్, ఇప్పుడు కెప్టెన్గా ఎంపిక కావడం ఆ కృషికి నిదర్శనం.
దేశీయ యువ క్రికెటర్లకు వినూ మన్కడ్ ట్రోఫీ ఎప్పటిలాగే తమ ప్రతిభను నిరూపించుకునే ఒక ప్రముఖ వేదికగా ఉంటుంది. ఈ టోర్నీలో అన్వయ్ ద్రావిడ్ కెప్టెన్గా, వికెట్ కీపర్గా రెండు కీలక పాత్రలు పోషించనున్నాడు. అతని ప్రదర్శనపై కర్ణాటక క్రికెట్ అభిమానులు పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా, కర్ణాటక సీనియర్ జట్టు కూడా రంజీ ట్రోఫీ కోసం తమ జట్టును ప్రకటించింది. మయాంక్ అగర్వాల్ ఆధ్వర్యంలో కొనసాగనున్న ఈ జట్టులోకి సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ తిరిగి ప్రవేశించడం విశేషం. అదేవిధంగా అనుభవజ్ఞులైన శ్రేయస్ గోపాల్, వైశాఖ్ విజయకుమార్ వంటి ఆటగాళ్లు కూడా ఈసారి జట్టులో స్థానం దక్కించుకున్నారు.