దుబాయ్ ఎయిర్పోర్ట్లో పేలుడు.. తృటిలో తప్పించుకున్న పీవీ సింధు
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నడుమ భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
By - అంజి |
దుబాయ్ ఎయిర్పోర్ట్లో పేలుడు.. తృటిలో తప్పించుకున్న పీవీ సింధు
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నడుమ భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దుబాయ్ విమానాశ్రయంలో ఆమె చిక్కుకుపోయిన సమయంలో, ఆమె ఉన్న ప్రాంతానికి అత్యంత సమీపంలో ఒక పేలుడు సంభవించింది. ప్రతిష్టాత్మకమైన 'ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్'లో పాల్గొనేందుకు సింధు తన టీమ్తో కలిసి బర్మింగ్హామ్ వెళ్తుండగా, దుబాయ్లో నిలిచిపోయారు. ఇరాన్-ఇజ్రాయెల్ దాడుల కారణంగా విమానాల రాకపోకలు ఆగిపోవడంతో ఆమె విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది.
"మేము ఆశ్రయం పొందుతున్న ప్రాంతానికి అతి సమీపంలోనే ఒక పెద్ద పేలుడు సంభవించింది. ఇది చాలా భయంకరమైన అనుభవం. క్షణక్షణానికి పరిస్థితి మారుతూ భయం పుట్టిస్తోంది" అని సింధు తన 'X' (ట్విట్టర్) ఖాతాలో చెప్పుకొచ్చారు. పేలుడు జరిగిన సమయంలో పొగ, శిథిలాలు పడిన చోటికి సింధు కోచ్ అత్యంత దగ్గరగా ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆయన అక్కడి నుంచి వేగంగా పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారని ఆమె తెలిపారు. ప్రస్తుతం సింధు, ఆమె బృందాన్ని దుబాయ్ విమానాశ్రయ అధికారులు, భారత హైకమిషన్ సహకారంతో మరింత సురక్షితమైన ప్రదేశానికి తరలించారు.
The ordeal continues to unfold, and the situation is becoming more frightening by the hour.A few hours ago, there was an explosion close to where we were holed up at the airport. My coach had to quickly run out of the area as he was closest to the smoke and debris. It was an… https://t.co/ZdNtuALk0P
— Pvsindhu (@Pvsindhu1) March 1, 2026
మార్చి 3 నుంచి ప్రారంభం కానున్న ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ కోసం సింధు దుబాయ్ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. అయితే ఇరాన్ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కావడంతో, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో వేలాది మంది ప్రయాణికులతో పాటు సింధు కూడా అక్కడే ఉండిపోయారు. దుబాయ్ విమానాశ్రయ సిబ్బంది, భారత దౌత్య అధికారులు తనకు అందిస్తున్న సహకారానికి సింధు ధన్యవాదాలు తెలిపారు. పరిస్థితులు త్వరగా చక్కబడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.