ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా అంచనాలను అందుకోలేకపోయింది. సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడి టోర్ని నుంచి నిష్క్రమించింది. అయితే.. ఆ టోర్నిలోని తొలి మ్యాచ్ను మాత్రం అభిమానులు ఎన్నటికి మరిచిపోలేరు. గ్రూప్ స్టేజ్లో దాయాదీ పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజులో నిలిచి టీమ్ఇండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్లో విరాట్ 82 పరుగులతో నాటౌట్గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మ్యాచ్ను విరాట్ మరోసారి గుర్తు చేసుకున్నాడు.
" 2022 అక్టోబర్ 23తేదీకి నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పటికే ఎన్నో మ్యాచ్లు ఆడినప్పటికీ అంత ఎనర్జీని ఎప్పుడూ అనుభవించలేదు. ఆ సాయంత్రం అద్భుతం." అని ఇన్స్టాగ్రామ్లో విరాట్ రాసుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్కి వెలుతున్న ఫోటోని షేర్ చేసుకున్నాడు.