అక్కడ ఈ రకమైన స్పిన్‌ను చూడలేదు..!

ఆదివారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

By -  Medi Samrat
Published on : 16 March 2026 5:21 PM IST

అక్కడ ఈ రకమైన స్పిన్‌ను చూడలేదు..!

ఆదివారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి తర్వాత, వారు భారత్‌ను గుర్తుచేసుకుని ఒక పెద్ద ప్రకటన చేశారు. 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో కివీస్ జట్టు భారత్ చేతిలో 96 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనితో, ఛాంపియన్లుగా ఎదగాలనే వారి కల చెదిరిపోయింది. భారత్‌ మూడోసారి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కివీస్, దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను ఆడుతున్నాయి. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోయింది. ఆ తర్వాత సాంట్నర్ భారత్‌ గురించి ప్రస్తావించాడు. కివీస్ జట్టు ఓటమి గురించి బహిరంగంగా మాట్లాడాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన బ్లాక్ క్యాప్స్ 91 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన ఓటమి తర్వాత సాంట్నర్ మాట్లాడుతూ.. "మేము ఊహించిన దానికంటే పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉందని నేను భావిస్తున్నాను.. దక్షిణాఫ్రికా చాలా బాగా బౌలింగ్ చేసింది.. ప్రారంభం నుండి మమ్మల్ని ఒత్తిడిలో ఉంచింది.. అటువంటి పిచ్‌పై మ‌నం త్వరగా వికెట్లు కోల్పోతే, ఆటలో నిలవడం కష్టం అవుతుంది. మేము 120 లేదా 130 పరుగులు చేసి ఉంటే, మేము వారికి కఠినమైన సవాలును విసిరేవాళ్ళం. మేము తదుపరి మ్యాచ్‌ను హామిల్టన్‌లో ఆడతాము, అక్కడ పిచ్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది."

"రెండవ మ్యాచ్‌లో మేము ఇలా నెమ్మదిగా ప్రారంభించకూడదనుకుంటున్నాము. ప్రతి మ్యాచ్ ఆటగాళ్లకు భవిష్యత్తు అవకాశాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి సహాయపడుతుంది. వారు బలమైన జట్టు.. వారు ఈ రోజు వారి బ‌లాన్ని చూపించారు. రాబోయే మ్యాచ్‌లలో వారు మాకు కఠినమైన పోటీని ఇవ్వ‌గలరు" అని సాంట్నర్ అన్నారు. మేము మరికొన్ని పరుగులు చేసి ఉంటే, మేము వారికి కఠినమైన పోటీని ఇచ్చేవాళ్లం. బంతి అలా స్పిన్ అవ్వడం చూడటం చాలా బాగుంది. న్యూజిలాండ్‌లో మనం సాధారణంగా అలా చూడము. మేము ఇటీవల భారత్‌లో ఆడాము, అక్కడ కొన్ని చోట్ల ఆ రకమైన స్పిన్‌ను చూడలేదు.. అందుకే అక్క‌డ‌ బాగుందని అన్నాడు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్. ఆ తర్వాత ప్రోటీస్ బౌలర్లు కివీస్ బ్యాట్స్‌మెన్‌లపై ఆధిపత్యం చెలాయించారు, వారిని 91 పరుగులకే అవుట్ చేశారు. ఆ తర్వాత కేశవ్ మహారాజ్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి మ్యాచ్‌ను గెలుచుకుంది.

Next Story