అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు మొదటి రోజు భారత బ్యాటర్లు సత్తా చాటారు. హెడింగ్లీ మైదానంలో కెప్టెన్గా తన తొలి టెస్టు ఆడుతున్న శుభ్మన్ గిల్ (127 నాటౌట్), యశస్వి జైస్వాల్ (101) సెంచరీలు సాధించగా, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (65 నాటౌట్) అర్ధశతకం సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాహుల్ (42) రాణించగా, అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ బెన్ స్టోక్స్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు.
ఇక మొదటి రోజు అనంతరం కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ కు దండం పెట్టాడు. పంత్ 65 పరుగులతో అజేయంగా గ్రౌండ్ నుండి డ్రెస్సింగ్ రూమ్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి ఉన్న కెఎల్ రాహుల్, చేతులు ముడుచుకుని గౌరవ భావంతో నమస్కరించాడు. పంత్ దూకుడైన ఆటతీరును రాహుల్ ఇలా మెచ్చుకున్నాడు.