భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. భారీగా చూసేశారు..!
ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయర్స్ రికార్డును సృష్టించింది.
By - Medi Samrat |
ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయర్స్ రికార్డును సృష్టించింది. T20 ప్రపంచ కప్ 2026 అధికారిక డిజిటల్, ప్రసార భాగస్వామి అయిన JioStar.. ఈ మ్యాచ్ 163 మిలియన్ల అద్భుతమైన డిజిటల్ రీచ్ అందుకున్నట్లు తెలియజేసింది. దీంతో ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్గా భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ నిలిచింది. అలాగే 2024లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ను కూడా ఇది అధిగమించింది.
డిజిటల్ ప్లాట్ఫామ్లలో భారత్ vs పాకిస్తాన్ ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్తో పోలిస్తే 56% పెరుగుదల నమోదయ్యింది. ఈ మ్యాచ్ అన్ని స్క్రీన్లలో 20 బిలియన్ నిమిషాల వీక్షణ సమయాన్ని సాధించింది. గత ఎడిషన్తో పోలిస్తే ఇది వీక్షకుల సంఖ్య 42% పెరుగుదలను సూచిస్తుంది. దీనికి కారణం భారత జాతీయ క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శన. ICC పురుషుల T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్ రికార్డును 8–1కి పెంచుకుని ఆధిపత్యం కొనసాగిస్తుంది.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 77 పరుగులు చేసి అదరగొట్టాడు. దీనికి సమాధానంగా పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో గెలిచి, T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై తమ రికార్డును 8-1కి మెరుగుపరుచుకుంది.