అదుపులోకి వ‌స్తున్న క‌రోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే

India Corona update on February 20th.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోకి వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి పాజిటివ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Feb 2022 4:51 AM GMT
అదుపులోకి వ‌స్తున్న క‌రోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోకి వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 11,87,766 ల‌క్ష‌ల‌ మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 19,968 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,22,473కి చేరింది. నిన్న 673 మంది మృతిచెందారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,11,903కి చేరింది.

ఒక్క రోజులో 48,847 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,20,86,383కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 2,24,187 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.28 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 1.68 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న30,81,336 మందికి పైగా టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 175.37 కోట్ల డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story