భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత
భారత మాజీ స్పిన్నర్ దిలీప్ దోషి జూన్ 23, సోమవారం 77 సంవత్సరాల వయసులో కన్నుమూశారు.
By అంజి
భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత
భారత మాజీ స్పిన్నర్ దిలీప్ దోషి జూన్ 23, సోమవారం 77 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. మాజీ ఎడమచేతి వాటం స్పిన్నర్ దోషి సోమవారం లండన్లో మరణించారని అతని కుటుంబ సన్నిహితుడు ఒకరు తెలిపారు. దిలీప్ దోషి 33 టెస్టులు, 15 వన్డేల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. మాజీ ఎడమచేతి వాటం స్పిన్నర్ దిలీప్ దోషికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. దోషి అంతర్జాతీయ క్రికెట్లో ఆలస్యంగా వికసించాడు. 1979-83 వరకు భారతదేశం తరపున ఆడాడు.
32 సంవత్సరాల వయస్సులో అరంగేట్రం చేశాడు. 33 టెస్ట్లలో దోషి 114 వికెట్లు పడగొట్టాడు అతను ఆడిన 15 వన్డేలలో 22 వికెట్లు పడగొట్టాడు. 1968-69 సీజన్లో దేశీయ సర్క్యూట్లో అరంగేట్రం చేసిన దోషి, 1986లో రిటైర్ అయ్యే వరకు 238 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడి 898 వికెట్లు పడగొట్టాడు. ఆ సమయంలో అతను బెంగాల్, సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. లీడ్స్ టెస్ట్లో సోమవారం రోజు ఆట ముగిసిన తర్వాత చతేశ్వర్ పుజారా దోషికి నివాళులర్పించారు. దోషి ఒక రత్నం లాంటి వ్యక్తి అని పుజారా అన్నారు.
ససెక్స్ తరపున కౌంటీ క్రికెట్ ఆడుతున్నప్పుడు మాజీ స్పిన్నర్తో తనకున్న సంభాషణలను కూడా వెల్లడించారు. సౌరాష్ట్ర ఆటగాళ్ల పట్ల దోషి సాఫ్ట్ కార్నర్ కలిగి ఉన్నందున, భారత జట్టుకు బాగా రాణించినప్పుడు దోషి తనకు ఎలా మెసేజ్ చేసేవాడో పుజారా గుర్తు చేసుకున్నాడు.
''నేను ఆయనను చాలాసార్లు కలిశాను, గొప్ప వ్యక్తి, రత్నం లాంటి వ్యక్తి, చాలా మృదువుగా మాట్లాడేవాడు. ఆయన ఇక్కడే నివసించేవారు, కాబట్టి నేను సస్సెక్స్ తరపున కౌంటీ క్రికెట్ ఆడుతున్నప్పుడల్లా, లండన్లో కూడా చాలాసార్లు కలిశాను. ఆయనది గొప్ప వ్యక్తిత్వం, ఆయన కుటుంబానికి నా సానుభూతి, ఎందుకంటే ఆయనను చాలా మిస్ అవుతారు. ఆయన సౌరాష్ట్ర ఆటగాళ్ల పట్ల సానుభూతిపరుడు. సౌరాష్ట్ర బాగా ఆడినప్పుడల్లా, ఆయన నాకు మెసేజ్ చేసేవాడు. నేను భారత జట్టుకు బాగా ఆడినప్పుడు ఆయన నాకు మెసేజ్ చేసేవాడు. కానీ అవును, నేను ఎల్లప్పుడూ ఆయనతో సంభాషించడం ఇష్టపడతాను'' అని పూజారా అన్నారు.
ఈ వార్తలపై మాజీ బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా వ్యాఖ్యానిస్తూ, ఇది తనకు చాలా బాధాకరమైన మరియు వ్యక్తిగత నష్టమని అన్నారు. దోషి తనకు మామ లాంటివాడని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా అన్నారు.