పింక్ బాల్ టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్
England won the toss and elected to bat in third test.ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది
By - తోట వంశీ కుమార్ |
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా మొతెరా వేదికగా డే అండ్ నైట్ టెస్టు ఆడనున్నాయి. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు చేరాలంటే ఈ మ్యాచ్ కీలకం కావడంతో ఇరు జట్లు గెలవాలనే పట్టుదలతో ఉండడంతో.. మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కొత్తగా నిర్మించిన ఈ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఈ స్టేడియం సామర్థ్యం లక్షా 10 వేలు. అయితే.. కరోనా కారణంగా సగం మందికే అనుమతి ఉంది. ఫ్లడ్లైట్లు లేకుండానే..అధునాతన టెక్నాలజీతో నిర్మించిన మొతెరా స్టేడియంలో ఫ్లడ్లైట్లకు బదులు స్టేడియంపై భాగం చుట్టూతా ఎల్ఈడీ లైట్లు అమర్చారు.
భారత జట్టు : రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, బుమ్రా.
ఇంగ్లాండ్ జట్టు: డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్స్టో, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.
Toss Update!
— BCCI (@BCCI) February 24, 2021
England have won the toss & elected to bat against #TeamIndia in the third @Paytm #INDvENG Test.
Follow the match 👉 https://t.co/mdTZmt9WOu pic.twitter.com/dfXBK8XPCn
ప్రారంభించిన రాష్ట్రపతి..
అంతకముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అతిపెద్ద స్టేడియమైన మొతెరాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ పాల్గొన్నారు. ఈ కొత్త స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు పెట్టడం పెట్టారు. అహ్మదాబాద్లోని ఈ స్టేడియాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే.
Gujarat: President Ram Nath Kovind and his wife perform 'bhumi pujan' of Sardar Vallabhbhai Patel Sports Enclave in Ahmedabad's Motera
— ANI (@ANI) February 24, 2021
Union Home Minister Amit Shah, Sports Minister Kiren Rijiju and Gujarat Deputy Chief Minister Nitin Patel also present pic.twitter.com/vWlEnoTPQ1