క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్‌లకు ఈడీ నోటీసులు

అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల వివాదంలో పలువురు ప్రముఖులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగిస్తోంది.

By -  Knakam Karthik
Published on : 16 Sept 2025 1:13 PM IST

Sports News, Yuvraj Singh, Robin Uthappa, illegal betting app case, ED

ఢిల్లీ: అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల వివాదంలో పలువురు ప్రముఖులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్, నటుడు సోనూ సూద్ తదితరులకు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఉతప్పను సోమవారం, యువరాజ్ సింగ్‌ను మంగళవారం, సోనూ సూద్‌ను బుధవారం పిలిపించారు. వీరిపై మనీ లాండరింగ్ చట్టం ఉల్లంఘనతో పాటు అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో భాగస్వామ్యం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికే మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా, నటి ఉర్వశి రౌతేలా, తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తిలను విచారణకు పిలిపించారు. రౌతేలాను 1xBet యాప్ యొక్క భారత అంబాసిడర్గా కొంతమంది మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఆమెతో పాటు బంగాళీ నటుడు అంకుష్ హజ్రా కూడా ఈరోజు విచారణకు హాజరయ్యారు. 1xBetతో పాటు పలు బెట్టింగ్ యాప్‌లు వినియోగదారులు, పెట్టుబడిదారులను మోసం చేశాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో, ED మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కోణంలో పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తోంది.

Next Story