రెజ్లర్లకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు..!

బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సత్యవర్త్ కడియన్ వంటి అగ్రశ్రేణి రెజ్లర్లకు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

By -  Knakam Karthik
Published on : 2 Dec 2025 3:02 PM IST

Sports News, Delhi High Court, WFI elections, Bajrang Punia, Vinesh Phogat

రెజ్లర్లకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు..!

బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, సత్యవర్త్ కడియన్ వంటి అగ్రశ్రేణి రెజ్లర్లకు ఢిల్లీ హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికలను సవాలు చేస్తూ వేసిన‌ ఈ రెజ్లర్ల పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ రెజ్లర్లందరూ చాలాసార్లు కోర్టుకు హాజరుకాకపోవడంతో వారి పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

WFI ఎన్నికలలో సంజయ్ సింగ్ అనితా షెరాన్‌ను ఓడించి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో విజయం సాధించారు. అనితకు ఈ టాప్ రెజ్లర్ల మద్దతు ఉంది. నవంబర్ 27న జస్టిస్ మినీ పుష్కర్ణ ఈ వ్యాజ్యాన్ని విచారించారు. పిటిషనర్లు ఎవరూ విచారణకు కోర్టుకు హాజరుకాలేదని గమనించారు. ఈ రెజ్లర్లు మునుపటి రెండు విచారణలకు హాజరు కాలేదని తేలింది. ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు పిటిషనర్లకు ఎలాంటి ఆసక్తి లేదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఎన్నికల ప్రక్రియలో లోపాలు, అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పిటిషనర్లు పలుమార్లు విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు పిటిషన్‌ను రద్దు చేసింది. డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు మంచి, పారదర్శక వాతావరణంలో జరగలేదని రెజ్లర్లు ఆరోపించారు.

Next Story