తొలి మ్యాచ్ లో ఆర్సీబీకి ఘోర పరాభవం

Delhi Capitals Women won by 60 runs. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి మ్యాచ్ లో ఓటమిని మూటగట్టుకుంది.

By M.S.R  Published on  5 March 2023 1:40 PM GMT
తొలి మ్యాచ్ లో ఆర్సీబీకి ఘోర పరాభవం

Royal Challengers Bangalore vs Delhi Capitals



ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి మ్యాచ్ లో ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ముంబయిలోని బ్రాబోర్న్ స్టేడియం లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టాపార్డర్ బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, కెప్టెన్ మెగ్ లానింగ్ తొలి వికెట్ కు 162 పరుగులు జోడించారు. షెఫాలీ 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేయగా, లానింగ్ 43 బంతుల్లో 14 ఫోర్లతో 72 పరుగులు చేసింది. లానింగ్, షెఫాలీ వర్మలను హీదర్ నైట్ ఒకే ఓవర్లో అవుట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్ కూడా భారీ షాట్లు ఆడారు. కాప్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 39 పరుగులు చేసింది. జెమీమా 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్ నోరిస్.. నాలుగు ఓవర్లు విసిరి 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ పతనాన్ని శాసించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు స్మృతి మంధాన (23 బంతుల్లో 35, 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ డెవైన్ (14) శుభారంభమే అందించారు. అయితే ఆ తర్వాత ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో హీథర్ నైట్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 భారీ సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసింది.

Next Story