చెన్నైను సొంత గ‌డ్డ‌పై ఓడించిన పంజాబ్

చెన్నై సూపర్ కింగ్స్ విజయ పరంపరను కొనసాగించలేకపోయింది. సొంత‌గ‌డ్డ‌పై పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది

By Medi Samrat  Published on  2 May 2024 2:07 AM GMT
చెన్నైను సొంత గ‌డ్డ‌పై ఓడించిన పంజాబ్

చెన్నై సూపర్ కింగ్స్ విజయ పరంపరను కొనసాగించలేకపోయింది. సొంత‌గ‌డ్డ‌పై పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అంత‌కుముందు KKRని ఓడించిన పంజాబ్.. ఈ మ్యాచ్‌లో చెన్నైని- ఓడించింది మరియు వరుసగా రెండవ విజయంతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. జానీ బెయిర్‌స్టో, రిలే రోసోవ్‌ల అద్భుతమైన బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.

పంజాబ్‌కు ఇది వరుసగా రెండో విజయం. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై కూడా ఆ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 62 పరుగుల సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంత‌రం పంజాబ్ కింగ్స్ జ‌ట్టులో బెయిర్‌స్టో 46 పరుగులు, రిలే రోసౌవ్ 43 పరుగులు చేయడంతో 17.5 ఓవర్లలో మూడు వికెట్లకు 163 పరుగులు చేసి విజయం సాధించింది.

ఓటమి పాలైనప్పటికీ చెన్నై జట్టు 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్ రెండు మ్యాచ్‌లు గెలిచి లాభపడగా, ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకుంది. దీంతో పంజాబ్ ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

Next Story