AUS vs IND: చెలరేగిన వాషింగ్టన్‌ సుందర్‌.. భారత్‌ విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్‌ విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా..

By -  అంజి
Published on : 2 Nov 2025 5:17 PM IST

AUS vs IND, 3rd T20I, India win, Cricket

AUS vs IND: చెలరేగిన వాషింగ్టన్‌ సుందర్‌.. భారత్‌ విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్‌ విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. చివరిలో వాషింగ్టన్‌ సుందర్‌, జితేశ్‌ శర్మ మెరుపులతో భారత్‌కు విజయాన్ని అందించారు. సుందర్‌ (49*) వీరోచిత ఇన్సింగ్స్‌ ఆడాడు. ఓపెనర్లు అభిషేక్‌ (25), సూర్య (24), తిలక్‌ వర్మ (29), జితేష్‌ (22* ) రాణించారు.

ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ 3 వికెట్లు, స్టాయినిస్‌, క్సేవియర్‌ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు టిమ్‌ డేవిడ్‌, స్టాయినిస్‌ రాణించడంతో ఆస్ట్రేలియా 186 రన్స్‌ చేసింది. భారత్‌ బౌలర్లలో అర్షదీప్‌ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి 2, శివమ్‌ దూబే ఒక వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయంతో సిరీస్‌లో ఇరు జట్లు 1 - 1తో సమంగా ఉన్నాయి.

Next Story