ఆసియా కప్ ఛాంపియన్ టీమిండియాకు బీసీసీఐ రూ.21 కోట్ల ప్రైజ్ మనీ
ఆసియా కప్ విజేత భారత క్రికెట్ జట్టు మరియు దాని సహాయక సిబ్బందికి ఇటీవల ముగిసిన టోర్నమెంట్లో అజేయంగా రాణించినందుకు..
By - అంజి |
ఆసియా కప్ ఛాంపియన్ టీమిండియాకు బీసీసీఐ రూ.21 కోట్ల ప్రైజ్ మనీ
ఆసియా కప్ విజేత భారత క్రికెట్ జట్టు మరియు దాని సహాయక సిబ్బందికి ఇటీవల ముగిసిన టోర్నమెంట్లో అజేయంగా రాణించినందుకు రూ. 21 కోట్ల ప్రైజ్ మనీని అందజేయనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఆదివారం దుబాయ్లో జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత బోర్డు ఈ ప్రకటన చేసింది. "ఇది అసాధారణ విజయం, అందువల్ల వేడుకల్లో భాగంగా, ఆసియా కప్లో భారత జట్టులో భాగమైన ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి BCCI రూ. 21 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది" అని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా PTI కి తెలిపారు.
అయితే, ఈ నిధి విభజన వివరాలను సంస్థ వెల్లడించలేదు. "ఆ డబ్బును పంపిణీ చేస్తారు. ఇది మా జట్టుకు, భారత క్రికెట్ బోర్డుకు, అలాగే భారత ప్రజలకు ఒక పెద్ద బహుమతి. దుబాయ్లో వారి అద్భుతమైన ప్రదర్శనకు మా క్రికెటర్లు, సహాయక సిబ్బంది పట్ల మేము చాలా గర్వపడుతున్నాము" అని సైకియా తెలిపారు.
బీసీసీఐ తన సోషల్ మీడియా పేజీలలో ఆనందోత్సాహాల సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది. "మూడు దెబ్బలు.. జీరో రెస్పాన్స్.. ఆసియా కప్ ఛాంపియన్స్.. మెసేజ్ డెలివర్డ్. (జట్టు మరియు సహాయక సిబ్బందికి రూ. 21 కోట్ల ప్రైజ్ మనీ" అని పాకిస్తాన్పై భారతదేశం సాధించిన అజేయ విజయ పరంపరను ప్రస్తావిస్తూ పేర్కొంది.
వాస్తవానికి, భారత జట్టు టోర్నమెంట్ అంతటా అజేయంగా నిలిచింది. దాని ఏడు మ్యాచ్ల్లోనూ గెలిచింది. "ASIA యొక్క అపజయం లేని ఛాంపియన్స్. పాకిస్తాన్పై ఆధిపత్య విజయం. 3-0తో టీం ఇండియాకు అభినందనలు. తిలక్ వర్మ, కుల్దీప్ అద్భుతమైన ప్రదర్శన. ఒత్తిడిలో గొప్ప ప్రదర్శన" అని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పోస్ట్ చేశారు.