భారతదేశంలోని ప్రముఖ పాదరక్షల రిటైలర్లలో ఒకటిగా, మెట్రో బ్రాండ్స్ ఇటీవల దాని రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్ ఉల్లంఘన , అమ్మకానికి ఉన్న పాదరక్షలపై దాని రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్లను చట్టవిరుద్ధంగా ఉపయోగించడంపై కఠిన చర్యలను ప్రారంభించింది. దీనిలో భాగంగా హైదరాబాద్లోని మెట్రో మిరాకిల్పై పెద్దఎత్తున దాడి చేసింది. బ్రాండ్ , కస్టమర్ల ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా కంపెనీ లీగల్ టీమ్ తీసుకున్న మరో చర్య ఇది.
మెట్రో బ్రాండ్స్ లీగల్ టీమ్ స్థానిక అధికారులతో కలిసి, దాడి నిర్వహించి మెట్రో బ్రాండ్స్ ట్రేడ్మార్క్లను కలిగి ఉన్న ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది. మెట్రో మిరాకిల్తో అనుసంధానించబడిన ఒక గోడౌన్ను దర్యాప్తుసంస్థలు కనుగొన్నాయి. ఈ నిర్ణయాత్మక చర్య బ్రాండ్ యొక్క మేధో సంపత్తిని కాపాడుకోవడం, వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టడం పట్ల దాని అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తుంది.
"భారతదేశంలోని ప్రముఖ పాదరక్షల రిటైలర్లలో ఒకరిగా, మెట్రో బ్రాండ్స్ వద్ద మేము మా బ్రాండ్ యొక్క సమగ్రతకు, సంవత్సరాలుగా మా కస్టమర్లతో మేము ఏర్పరచుకున్న నమ్మకానికి నష్టం నిరోధించడానికి కట్టుబడి ఉన్నాము" అని మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ లీగల్ & కంపెనీ సెక్రటరీ దీపా సూద్ అన్నారు. " నకిలీ వస్తువుల నుండి మా కస్టమర్లను రక్షించడానికి మేము శ్రమిస్తున్నాము , మా ట్రేడ్మార్క్లను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించే ఎలాంటి సంస్థపైన అయినా కఠినమైన చర్యలు తీసుకుంటూనే ఉంటాము" అని జోడించారు.
నకిలీ వస్తువులను నివారించడానికి అధీకృత రిటైల్ దుకాణాలు , అధికారిక ఆన్లైన్ ప్లాట్ఫామ్ల నుండి మాత్రమే తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ వినియోగదారులను కోరుతోంది. కంపెనీ తన చట్టపరమైన హక్కులను కాపాడుకోవడానికి, ఐపీఆర్ ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలపై నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి కట్టుబడి ఉంది.